తుంగతుర్తి, మే 17 : మండల కేంద్రంలోని దవాఖానను 12 పడకల ఆక్సిజన్ ఐసొలేషన్ కేంద్రంగా మార్చనున్నట్లు సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగంధర్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం వారు ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంచినీటి సమస్య ఉందని సిబ్బంది తెలుపగా.. దవాఖాన ఆవరణలోని పాత బావిని పరిశీలించి మరమ్మతులు చేయాలని ఏఈ నవకాంత్కు సూచించారు. మరుగుదొడ్లు, పారిశుధ్యానికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. టెస్టులకు వచ్చే వారికి త్వరగా పరీక్షలు చేసి కిట్లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, డాక్టర్ నిర్మల్కుమార్, జ్యోత్స్న, హెచ్ఈఓ సముద్రాల సూరి, గోవిందరెడ్డి, తునికి నాగరాజు, గాజుల సోమయ్య పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు
నూతనకల్ : కరోనా పరీక్షల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. దవాఖానకు వచ్చే రోగులకు కరోనా పరీక్షలతోపాటు వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, మండల వైద్యాధికారి త్రివేణి, సీహెచ్ఓ శ్రీను, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
అర్వపల్లి : కరోనా వ్యాప్తి కట్టడికి ప్రతిఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే కిశోర్కుమార్ సూచించారు. మండల కేంద్రంలో సోమవారం లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట తాసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుంట్ల సురేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.