సూర్యాపేట, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : డెయిరీ రైతులకు పెండింగ్ ప్రోత్సాహకాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం రాష్ట్ర శాసనసభా ప్రాంగణంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును కలిసి బకాయి విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు వినతిపత్రం సమర్పించగా ఈనెల 18 తరువాత డెయిరీ రైతుల ప్రోత్సాహకాల విడుదలకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి తెలిపారు. దీంతో 2019-20, 2020-21 సంవత్సరాలకు సంబంధించి రూ.24కోట్లు విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. నిధుల విడుదలకు సహకరించిన మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, తలసాని, హరీశ్రావుకు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు.