పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు
దరిచేరని సీజనల్ వ్యాధులు
పెద్దవూర, ఏప్రిల్ 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయి. పెద్దవూర మండలంలో 26గ్రామ పంచాయతీలు ఉండగా చెత్తాచెదారం లేకుండా వీధులన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. ప్రతి పంచాయతీకి పూర్తిస్థాయిలో నిధులను అందించడంతోపాటు నాలుగు నుంచి ఆరుగురు సిబ్బందిని నియమించారు. వారు హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ, మురికి కాల్వల శుభ్రం, వీధులన్నీ ఊడ్చడంతోపాటు ట్రాక్టర్తో చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. దీంతో గ్రామాలు పరిశుభ్రంగా మారి సీజనల్ వ్యాధులు దరిచేరడం లేదు. గ్రామాలు పరిశుభ్రత, పల్లె ప్రకృతి వనాలతో ఆహ్లాదంగా మారడంతో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
లవ్ స్టోరీ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!
కర్ణాటక సీఎం యడ్యూరప్పకు మళ్లీ కరోనా పాజిటివ్