కోదాడ టౌన్, మే 13 : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లాలో రెండో రోజు గురువారం సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం ఆరు 10 గంటల వరకు ప్రభుత్వం నిత్యావసరాల కొనుగోలు కోసం సడలింపు ఇవ్వడంతో ప్రజలు సంఖ్యలో బయటకు వచ్చారు. దీంతో ఆయా పట్టణాలు, మండల కేంద్రాల్లోని సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, కూరగాయల మార్కెట్ల వద్ద రద్దీ నెలకొంది. శుక్రవారం రంజాన్ పండుగ వస్త్ర దుకాణాలు, కిరాణా షాపులు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో కోదాడ పట్టణంలోని పెద్ద మసీదు వద్ద, థియేటర్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిపోయాయి. 10 గంటల తర్వాత ఖాళీగా కన్పించాయి. అనవసరంగా రోడ్లపై తిరిగే జరిమానా విధించి లాక్డౌన్పై అవగాహన కల్పించారు. మేళ్లచెర్వు మండలం గ్రామంలో డీజే పెట్టి పెండ్లి ఊరేగింపు నిర్వహిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేశారు. డీజే వాహనాన్ని సీజ్ చేశారు.
కోదాడ రూరల్ రాష్ట్ర సరిహద్దు రామాపురం చెక్పోస్టు వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోకి అత్యవసర సర్వీసులు, అనుమతులున్న వాహనాలను మాత్రమే అనుమతించారు. అనుమతి లేని వాటిని వెనుకకు పంపించారు. ఈ సందర్బంగా ఆర్.భాస్కరన్ సరిహద్దును పరిశీలించారు. 24 గంటలు పోలీసులు, వివిధ శాఖల అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. ప్రతి వాహనాన్ని తప్పక తనిఖీ సూచించారు.
తిరుమలగిరి : జలాల్పురం, వెలిశాల, తొండ, తాటిపాములగ్రామాల్లో లాక్డౌన్పై వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు మూసివేద్దామనే ధోరణి అవలంబిస్తున్నారు. గ్రామాల్లోని బెల్టు షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. లాక్డౌన్ సమయంలో దుకాణాలను బంద్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.