సూర్యాపేట టౌన్, మే 13 : సూర్యాపేట పట్టణంలో ఆక్సిజన్ కొరత అన్నదే తలెత్తకుండా త్వరలోనే ప్లాంట్ నిర్మించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొవిడ్ పాజిటివ్ అని తేలగానే ఆందోళన చెందవద్దని సూచించారు.కొవిడ్ వచ్చిన వారికి వైద్యం అందించే విష యంలో ప్రభుత్వం అప్ర మత్తంగా ఉందన్నారు. ప్రైవేట్ దవాఖా న ల్లో ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠినంగా కేసులు నమోదు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు
మందులకు కొరత లేదు
ఉమ్మడి ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలను సరిపడా మందులను అందుబాటులో ఉంచామని, రెమ్డెసివిర్ సహా కరోనాకు సంబంధించిన మందులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. కొవిడ్ బారిన పడి చిన్న ఇండ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం అత్యవసర పరిస్థితుల్లో కేసారంలో నిర్మించిన రెండు పడకల ఇండ్లను 100 పడకల ఐసొలేషన్ కేంద్రంగా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
మానసిక ధైర్యమే మందు
కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని.. ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఇక భయాందోళలనే మనిషిని ఆగం చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలని..మానసిక ధైర్యమే కరోనాపై విజయానికి మందులాగా పనిచేస్తుందన్నారు. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడిన వా రికి సరిపడా బెడ్లు ఖాళీగా ఉన్నాయని వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉం టూ సకాలంలో వైద్య సేవలందిస్తున్నారన్నారు.
వ్యాక్సిన్పై అపోహలొద్దు
వ్యాక్సినేషన్పై అపోహలు మాని అంతా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుగా 65 ఏండ్లు దాటిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి అందించామని.. ప్రస్తుతం రెండో డోస్ టీకా వేస్తున్నారని.. 45 ఏండ్లు దాటిన వారికి అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలతో కరోనా కట్టడికి విస్తృత చర్యలు చేపడుతూ సంబంధిత శాఖలతో పాటు ప్రజా ప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారన్నారు.
అత్యవసరమైతే తప్ప రావద్దు
రాష్ట్రమంతా ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సుమారు 4 గంటల పాటు లాక్డౌన్కు సడలింపు ఇచ్చారని ఆ సమయంలోనూ అంతా బయటకు రాకుండా అత్యవసరమైన వారు మాత్రమే నిబంధనలు పాటిస్తూ బయటకు రావాలన్నారు.ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. సాధ్యమైనంత వరకూ వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధ్దులను ఇంటి పట్టునే ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీఎంహెచ్ఓ కోటాచలం, జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి, ఆర్ఎంఓ కళావతి, ఆర్డీఓ రాజేందర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, వైద్య ఉద్యోగుల రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మాండన్ సుదర్శన్ ఉన్నారు.