మునగాల, మే 12 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని మాధవరంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించినా కొనుగోలు కేంద్రాలకు వెసులుబాటు కల్పించిందన్నారు. విక్రయించిన మూడ్రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట తాసీల్దార్ కృష్ణ, ఏపీఓ వెంకన్న, వీఆర్ఏ వెంకన్న, రైతులు ఉన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సూర్యాపేట రూరల్ : అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ మోహన్రావు మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మండలంలోని టేకుమట్ల, యండ్లపల్లి, సోలిపేట గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కాంటా వేయాలని నిర్వాహకులకు సూచించారు. లోడింగ్ కోసం లారీలు రాక ట్రాన్స్పోర్టు ఇబ్బంది ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే మిల్లర్లతో మాట్లాడి కాంటా వేసిన బస్తాలు లోడింగ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, తాసీల్దార్ వెంకన్న, మార్కెటింగ్ శాఖ డీఎం రామ్పతి, సర్పంచులు ఉన్నారు.