సూర్యాపేట అర్బన్/ఆత్మకూర్.ఎస్, మే 10 : కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో సోమవారం 100 మందికి కరోనా టీకాలు వేశారు. అలాగే ఆత్మకూర్.ఎస్లోని పీహెచ్సీలో 86మందికి పరీక్షలు చేయగా 37మందికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ ఆనంద్కుమార్ తెలిపారు. 99మందికి టీకాలు వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీహెచ్ఓ ఆవుల వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్ రంగమ్మ, శ్యామ్కుమార్, స్టాఫ్ నర్స్ భూపాల, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాలకవీడు : మండలంలోని పాలకవీడు, శూన్యంపహాడ్లో ఇంటింటి జ్వర సర్వే సోమవారం కొనసాగింది. కొవిడ్ లక్షణాలు ఉన్నవారికి మెడికల్ కిట్లు అందించి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సుశీల, ఆర్ఐ జానీపాషా, వీఆర్ఓ వెంకన్న, పంచాయతీ కార్యదర్శి రావుల నరేందర్, టీఆర్ఎస్ నాయకుడు జాన్రెడ్డి పాల్గొన్నారు.
మేళ్లచెర్వు/కోదాడ రూరల్ : మేళ్లచెర్వు, కోదాడ మండల వ్యాప్తంగా సోమవారం ఐదో రోజూ ఇంటింటి జ్వర సర్వే కొనసాగింది. బృందాలు కరోనా లక్షణాలపై అవగాహన కల్పిస్తూ 1347 కుటుంబాల్లో సర్వే చేయగా 47 మందికి జ్వరం, కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని ఆర్ఐ వాసుదేవరావు తెలిపారు. మేళ్లచెర్వులో సర్వే తీరును ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ వీరయ్య, సర్పంచ్ శంకర్రెడ్డి, కార్యదర్శి నారాయణరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్ఐ శశిధర్, వీఆర్వోలు ప్రియాంక, వీరబాబు పాల్గొన్నారు.
చివ్వెంల : మండలంలో 39 బృందాలు సర్వే చేస్తున్నాయి. ఇప్పటివరకు 2643 కుటుంబాల్లో సర్వే చేసినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రాజ్కుమార్ తెలిపారు. వారిలో 40మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 52 మందికి కరోనా పరీక్షలు చేసి 16 మందికి పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. 80మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.
నూతనకల్ : మండలంలోని బిక్కుమళ్ల, లింగంపల్లి గ్రామాల్లో చేపట్టిన జ్వర సర్వేను సోమవారం ఎంపీడీఓ ఇందిర పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బొల్లెపల్లి అశోక్, పంచాయతీ కార్యదర్శి గంగరాజు, ఏఎన్ఎం ఉమ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : స్వీయ నియంత్రణతోనే కరోనా కట్టడి సాధ్యమని మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు అన్నారు. మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆరోగ్య సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు సమాచారం అందిస్తే హోం ఐసొలేషన్ కిట్టు అందిస్తారన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు చిట్యాల శ్రీను ఉన్నారు.
ప్రజలు సహకరించాలి
కోదాడటౌన్ : సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ మేనేజర్ అంకుశావలీ కోరారు. సోమవారం మున్సిపాలిటీలో 50 బృందాలు 2907 ఇళ్లను పరిశీలించగా 14మందికి కరోనా లక్షణాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
221మందికి టీకాలు
నేరేడుచర్ల : నేరేడుచర్ల, పెంచికల్దిన్నె పీహెచ్సీల్లో సోమవారం 221 మందికి కరోనా టీకాలు, 127మందికి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు నాగయ్య, హరికిషన్ తెలిపారు. నేరేడుచర్ల పీహెచ్సీలో 190 మందికి టీకాలు, 60 మందికి పరీక్షలు, పెంచికల్దిన్నెలో 31 మందికి టీకాలు, 66మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు.
మేళ్లచెర్వులో 65 మందికి..
మేళ్లచెర్వు : స్థానిక పీహెచ్సీలో సోమవారం 65 మందికి టీకా వేసినట్లు మండల వైద్యాధికారి ప్రేమ్సింగ్ తెలిపారు. 155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
మునగాల : స్థానిక పీహెచ్సీలో 38 మందికి పరీక్షలు చేయగా 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు, అలాగే 91మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి రమేశ్ తెలిపారు. రేపాల పీహెచ్సీలో 130కి పరీక్షలు చేయగా 20 మందికి పాజిటివ్ వచ్చినట్లు, 90 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి దిలీప్కుమార్ తెలిపారు.
చిలుకూరులో 29మందికి పాజిటివ్
చిలుకూరు : చిలుకూరు పీహెచ్సీలో 121 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి ప్రమోద్కుమార్ తెలిపారు. అలాగే 112 మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.