కోదాడటౌన్ , మే 8 : కోదాడ పట్టణంలోని 7వ వార్డులో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేను మున్సిపల్ మేనేజర్ అంకుశావలీ ఆదివారం పరిశీలించారు. పట్టణంలో 220 మంది సిబ్బంది 3,623 ఇళ్లను పరిశీలించగా 9 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా సిబ్బంది గుర్తించినట్లు తెలిపారు. ఈ సర్వేలో మున్సిపల్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
తిరుమలగిరి: మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్, వైద్య సిబ్బంది 10,1,12 వార్డుల్లో ఇంటింటి జ్వర సర్వే చేశారు. కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకున్నారు. సర్వేను మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ పర్యవేక్షించారు.
నాగారం: నాగారం బంగ్లాలోప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బ ంది, గ్రామ పంచాయతీ సిబ్బంది సర్వే నిర్వహించింది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుంటకండ్ల వీరారెడ్డి, వార్డు సభ్యులు బెల్లి నరేశ్, సునీత, వీరయ్య, సిబ్బంది సతీశ్, నాగాచారిపాల్గొన్నారు మఠంపల్లి : మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నారు అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్య సిబ్బంది వెంటనే మందులు, తగు సూచనలు అందిస్తున్నారు.
పాలకవీడు : మండలంలోని గుడుగుంట్లపాలెం గ్రామంలో జ్వర సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్త మంజుల, అంగన్వాడీ టీచర్ కళమ్మ పాల్గొన్నారు.
గరిడేపల్లి : గరిడేపల్లి పీహెచ్సీ పరిధిలో 20 గ్రామ పంచాయతీల్లో 25 బృందాలు ప్రతి ఇంటింటికీతిరిగి సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో భాగంగా జ్వరం, జలుబు, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించారు. అవసరమైన వారికి కిట్ అందజేశారు. కార్యక్రమాల్లో వైద్యాధికారి రమ్య, సూపర్వైజర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.