అంత్యక్రియలకు వెళ్తుండగా చివ్వెంలలో ప్రమాదం
చికిత్స పొందుతూ తుదిశ్వాస
చివ్వెంల, మే 9 : మండలంలోని జి.తిరుమలగిరి శివారులో జాతీయ రహదారి-65పై శనివారం రాత్రి జైలో వాహనం బోల్తా పడిన ఘటనలో ఏడుగురు గాయపడిన విషయం విదితమే. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మృతి చెందారు. ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడేనికి చెందిన అంబూరి లక్ష్మి హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉంటుంది. తాడేపల్లి గూడెంలో బం ధువు మృతి చెందగా అంబూరి లక్ష్మితోపాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలకు వెళ్తుండగా వారి వాహనానికి జి.తిరుమలగిరి శివారులో పశువులు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో సామాడ ఉదయ్భాస్కర్ (26)సూర్యాపేట జనరల్ దవాఖానలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి మృతి చెందగా, గుంటూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న అంబూరి లక్ష్మి(28)ఆదివారం మృతి చెందింది. ఉదయ్ భాస్కర్కు భార్య, ఇద్దరు కూ తుళ్లు, కుమారుడు ఉండగా, లక్ష్మికి కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
బైక్ అదపు తప్పిన ఘటనలో..
చిట్యాల : సూర్యాపేట జిల్లా మోతె గ్రామానికి చెందిన దోసపాటి ఏసు(40) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం మృతి చెందినట్లు ఏఎస్ఐ జోజి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఏసు పెద్దకాపర్తిలోని వినయ్రెడ్డి తోటలో పనిచేస్తున్నాడు. ఈ నెల 8న పలివెలలోని తన బంధువుల ఇంటికి బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా మొర్సుగూడెం వద్ద బైక్ అదుపు తప్పి కింద పడి గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.