అర్వపల్లి, మే 8: కరోనా కట్టడి కోసం గ్రామాల్లో చేపట్టిన ఇంటింటి జ్వర సర్వేకు ప్రజలంతా సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోహన్రావు పిలుపునిచ్చారు. మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో వైద్యసిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. ఇంటింటి సర్వేలో వైద్యసిబ్బంది ఆరోగ్య సమస్యలను తెలుసుకుని కావాల్సిన మందులను ఇంటి వద్దకే తెచ్చిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా మేనేజర్ రాంపతి, తాసీల్దార చంద్రశేఖర్రెడ్డి, హరిశ్చంద్రప్రసాద్, ఏపీఎం ఇద్దయ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
అనంతగిరి : కొవిడ్ లక్షణాలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. మండల కేంద్రంలో శనివారం సిబ్బంది నిర్వహిస్తున్న జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. లక్షణాలు ఉన్న ఓ వ్యక్తి కి ఐసొలేషన్ కిట్టు పంపిణీ చేసి మాట్లాడారు. వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా మందులు వాడాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి ప్రసన్న, వెంకమ్మ, కళావతి, రత్నమేరి, శైలజ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
కోదాడ టౌన్ : ఇంటింటి జన సర్వే పక్కగా ఉండాలని కోదాడ తాసీల్దార్ శ్రీనివాస శర్మ సూచించారు. పట్టణంలోని 7వ వార్డులో శనివారం నిర్వహించిన ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. కోదాడ మున్సిపాలిటీలో 55 బృందాలు 220 మంది సిబ్బంది 5,794 ఇళ్లు సర్వే చేయగా 66 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు మున్సిపల్ మేనేజర్ అంకుశవలీ తెలిపారు. ఈ సర్వేలో రెవెన్యూ, మున్సిపల్ వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్: మండలంలోని టేకుమట్ల, హనుమనాయక్తండాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను ఎంపీడీఓ శ్రీనివాస్రావు పరిశీలించి మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామ పంచాయితీలో నలుగురు అధికారులతో కూడిన టీమ్ను ఏర్పాటు చేసి జర సర్వేను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ వెంకన్న, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
చివ్వెంల: మండలంలో మూడోరోజూ 2,675 కుటుంబాలకు సర్వే నిర్వహించారు. మొత్తం 10, 424 కుటుంబాలకు గాను 7,587 కుటుంబాలకు సర్వే పూర్తయినట్లు తాసీల్దార్ రంగారావు తెలిపారు. 120 మందికి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇప్పటివరకు మండలంలో 354 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
మఠంపల్లి :మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో శనివారం వైద్య, రెవెన్యూ బృందాలు చేస్తున్న సర్వేను ఆయన పర్యవేక్షించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వెంటనే మందులు, తగు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు.
నేరేడుచర్ల : కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ గోపయ్య అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఇంటింటీకి వచ్చే సిబ్బందికి తెలియజేయాలని కోరారు. మున్సిపాలిటీలోని 15 వార్డులు ఉండగా ఒక్కొక్క వార్డులో ముగ్గురు సభ్యులు కలిసి టీం సర్వే చేస్తున్నాన్నారు. మున్సిపాలిటీలో సుమారు 4 వేలు గృహాలు ఉండగా ప్రస్తుతానికి 753 గృహాలు సర్వే చేయగా 40 మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరికి హోంహైసోలేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ బాష, మున్సిపల్ సిబ్బంది శివ, కిశోర్, శ్రీకాంత్, సైదులు, శ్రీను, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గరిడేపల్లి: కల్మల్చెర్వు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోమ్లాతండా, శీత్లాతండా, లుంబాతండాల్లో వైద్యాధికారి సుధీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించారు. కొద్దిమేర లక్షణాలు ఉన్నవారికి కిట్లు అందించి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు సోని, పీహెచ్సీ సూపర్వైజర్ దైద వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం శాంతమ్మ, ఆశ కార్యకర్త సరస్వతి, కార్యదర్శి నర్సరాజు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : మండల వ్యాప్తంగా మూడో రోజూ ఇంటింటి జ్వర సర్వే కొనసాగింది. 35 బృందాలు కరోనా లక్షణాలపై అవగాహన కల్పిస్తూ 1,720 కుటుంబాల్లో సర్వే చేయగా.55 మందికి జ్వరం, కొవిడ్ లక్షణాలను గుర్తించినట్లు ఆర్ఐ వాసుదేవరావు తెలిపారు. హోం ఐసొలేషన్లో ఉన్నవారు ఇంటి నుంచి బయటకు రాకుండా సకాలంలో మందులు వాడాలని అవగాహన కల్పించారు.
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలోఇంటింటి సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పత్తిపాటి రమ్యానాగరాజు, ఉపసర్పంచ్ గురవయ్య, కార్యదర్శి ఇందిరా,ఏఎన్యమ్ అలివేలు మంగ, అంగన్వాడీ టీచర్లు మంజుల, పార్వతి, ఆశ వర్కర్లు కమలమ్మ,సునీత తదితరులున్నారు.
చిలుకూరు : మండల వ్యాప్తంగా 42 బృందాలు ఆయా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేశారు. ఇంటింటి సర్వేను తాసీల్దార్ రాజేశ్వరీదేవి ఎంపీడీఓ ఈదయ్య, ఎస్ఐ నాగభూషణరావు, ఎంపీఓ నర్సింహారావులు పరిశీలించి జాగ్రత్తగా చేయాలని సూచిం చారు .
కోదాడ రూరల్ : మండలంలోని తొగర్రాయిలో ఇంటింటి సర్వేను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశవర్కర్లు పాల్గొన్నారు.