నేరేడుచర్ల, మే 7 : కరోనా కట్టడి కోసం ఇంటింటా జ్వర సర్వే చేస్తున్నట్లు ఎంపీడీఓ విజయకుమారి అన్నారు. మండలంలోని కల్లూరు, పెంచికల్దిన్నె గ్రామాల్లో చేపట్టిన శుక్రవారం జ్వర సర్వేను ఆమె పరిశీలించి మాట్లాడారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు 17 టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కొక్క గ్రామంలో నలుగురు సభ్యు తో కూడిన ఒక టీం ఇంటింటా సర్వే చేస్తుందన్నారు. పెంచికల్దిన్న వైద్యాధికారి హరికిషన్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కోదాడటౌన్ : పట్టణ వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖకు చెందిన 55 బృందాలు రెండో రోజు శుక్రవారం 4,698 ఇళ్లలో సర్వే జరిపారు. ఇంటింటికి తిరిగి జ్వరం, కొవిడ్ లక్షణాలున్న వారి వివరాలను నమోదు చేసుకున్నారు. 36 మందికి కరోనా లక్షణాలను గుర్తించినట్లు మున్సిపల్ మేనేజర్ అంకుశావలీ తెలిపారు.
మేళ్లచెర్వు: మండల వ్యాప్తంగా శుక్రవారం రెండో రోజూ ఇంటింటి సర్వే కొనసాగింది. ఎర్రగట్టు తండాలో ఇన్చార్జి ఎంపీడీఓ జోగు శ్రీనివాసరెడ్డి, మేళ్లచెర్వులో ఆర్ఐ వాసుదేవరావు సర్వే తీరును పరిశీలించారు. 35 టీమ్లు కరోనా లక్షణాలపై అవగాహన కల్పిస్తూ 2,151 కుటుంబాల్లో సర్వే నిర్వహించగా 80 మందికి కరోనా సోకినట్లు గుర్తించినట్లు తాసీల్దార్ దామోదర్రావు తెలిపారు.
హుజూర్నగర్ రూరల్ :మండలంలోని బూరుగడ్డ గ్రామంలో చేపట్టిన సర్వేను తాసీల్దార్ వజ్రాల జయశ్రీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని 410 ఇళ్లలోకి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించినట్లు తెలిపారు. కార్యదర్శి సుధీర్, వీఆర్వో శంకర్, వీఆర్ఏ నవత, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
చివ్వెంల : రాజు తండాలో నిర్వహించిన సర్వేలో తాసీల్దార్ రంగారావు పాల్గొని మాట్లాడారు. మండల వ్యాప్తంగా 39 టీంలు పనిచేస్తున్నట్టు తెలిపారు. 10,424 కుటుంబాలకు ఇప్పటి వరకు 4,912 కుటు ంబాలకు సర్వే నిర్వహించినట్టు తెలిపారు. 234 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వెంటనే మందులు ఇచ్చినట్టు తెలిపారు.ఎంపీడీఓ జమలారెడ్డి, మండలవైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్, ఎంపీఓ గోపి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు