సూర్యాపేట రూరల్, మే 7 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని డీసీఎంస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని 13వార్డు గాంధీ నగర్లో ప్రభుత్వం అందించిన దుస్తులను పేద ముస్లింలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, ఎంపీటీసీ మామిడి కిరణ్, కోఆప్షన్ సభ్యుడు గాలిబ్ అహ్మద్, మైనార్టీ నాయకులు ఎస్కే రఫీ, చాంద్పాషా తదితరులు పాల్గొన్నారు.
కోదాడటౌన్ : పట్టణంలోని 33వ వార్డులో ముస్లింలకు కౌన్సిలర్ షేక్ ఖదీర్ పాషా ప్రభుత్వం అందించిన రంజాన్ కానుకను ముస్లింలకు పంపిణీ చేశారు.
నేరేడుచర్ల : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని మతాలకు సమప్రాధాన్యతనిస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన రంజాన్ దుస్తులను తాసీల్దార్ కార్యాలయంలో మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు చందమళ్ల జయబాబు, ఇంజమూరి యశోధ, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి సమక్షంలో పంపిణీ చేశారు. అనంతరం 101 మందికి షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ సరిత, మున్సిపల్ కౌన్సిలర్ బాష, మేడారం ఎంపీటీసీ రాజేశ్, ఆర్ఐ ప్రవీణ్, ముస్లిం మత పెద్దలు ఇబ్రహీం, ఖాదర్, మీరా, గౌస్, అప్సర్, కాశీం, టీఆర్ఎస్ నాయకులు చిట్యాల శ్రీను, కర్ణాకర్ పాల్గొన్నారు.
గరిడేపల్లి: మండలకేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్, హుజూర్నగర్ ఏఎంసీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి శుక్రవారం జడ్పీటీసీ పోరెడ్డి శైలజా రవీందర్రెడ్డిలతో కలిసి పేద ముస్లింలకు రంజాన్ దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ కార్తీక్ పాల్గొన్నారు.
చివ్వెంల : మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ముస్లింలకు అందజేసిన రంజాన్ కానుకలను ఎంపీపీ ధరావత్ కుమారి పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ జమలా రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జూలకంటి సుధాకర్రెడ్డి, రాజు నాయక్, ఆర్ఐలు రామారావు, వెంకట్రెడ్డి ఉన్నారు.
ఆత్మకూర్.ఎస్ : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ముస్లింలకు జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీ మర్ల స్వర్ణలత చంద్రారెడ్డి రంజాన్ కానుకలను శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసీల్దార్ సుదర్శన్రెడ్డి, ఎంపీడీఓ మల్సూర్నాయక్, వైస్ ఎంపీపీ నేరెళ్ల వెంకన్న పాల్గొన్నారు.