ఎంపీపీ గూడెపు శ్రీనివాస్
హుజూర్నగర్ రూరల్, ఏప్రిల్ 7 : రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని వేపలసింగారం, అమరవరం, శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు వీరభద్రారావు, మండలాధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, సర్పంచులు అన్నెం శిరీష, గుజ్జుల సుజాత, సౌజన్య, అన్నెం శివారెడ్డి, భాస్కర్రెడ్డి, భద్రారెడ్డి, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి
పాలకవీడు : కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని ఎంపీపీ గోపాల్ సూచించారు. బుధవారం మండలంలోని బొత్తలపాలెం, జాన్పహాడ్, రావిపహాడ్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. సర్పంచులు బోగాల వీరారెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, మోతీలాల్నాయక్, వైస్ ఎంపీపీ ఉపేందర్, ఎంపీటీసీలు కవిత, విజయ, సీసీ జేత్రాంనాయక్ పాల్గ్గొన్నారు.
‘ప్రతి ధాన్యం గింజా కొంటం’
మఠంపల్లి : రైతులు పండించే ప్రతి ధాన్యం గింజా కొంటామని ఎంపీపీ ముడావత్ పార్వతీకొండానాయక్ అన్నారు. బుధవారం మండలంలోని బాడవతండా, దొనబండతండాలో ఐకేపీ కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1868 మద్దతు ధర పొందాలన్నారు. తాసీల్దార్ లక్ష్మణ్బాబు, జడ్పీటీసీ జగన్నాయక్, ఏఓ బుంగా రాజు, ఏపీఎం శ్రీనివాస్, సర్పంచులు బాణోతు శ్రీనివాస్, పాండునాయక్, రమేశ్నాయక్, నర్సింహారావు, సీసీ నర్సయ్య, మాజీ ఎంపీపీ కొండానాయక్, రాములయ్య, రైతులు పాల్గొన్నారు.
మేళ్లచెర్వు : మండలంలోని కందిబండలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కొట్టె పద్మావతి బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గాయం గోపిరెడ్డి, ఎంపీటీసీ పొనగండ్ల పుష్ప, ఏపీఎం విజయ్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
నడిగూడెం : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణీపుల్లారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బృందావనపురంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. తేమ శాతం 17లోపు ఉండేలా చూసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి, జడ్పీటీటీసీ బాణాల కవిత, ఎంపీటీసీ గోలి సునీత, ఏపీఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కోదాడ రూరల్ : మండలంలోని ఎర్రవరం, రామలక్ష్మీపురం, బీక్యాతండాలో కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ చింతా కవితారెడ్డి, జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు బాణోతు అంబేద్కర్, వీరేపల్లి సుబ్బారావు, మస్తాన్, సీఈఓ జానీపాషా, రైతుబంధు సమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇంజమూరి యశోదారాములు, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి అన్నారు.
బుధవారం నేరేడుచర్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కౌన్సిలర్లు బాషా, సాయి, ఎంపీడీఓ ఉపేందర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొప్పుల రాంరెడ్డి, డైరెక్టర్లు సురేశ్రెడ్డి, శంకరాచారి, వెంకట్రెడ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి, శ్రీధర్, శ్రీను, వీరయ్య, సైదిరెడ్డి, చంద్రయ్య, రాజేశ్, నవీన్ పాల్గొన్నారు.
మునగాల/చిలుకూరు : మునగాల మండలంలోని బరాఖత్గూడెంలో కొనుగోలు కేంద్రాన్ని కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణి ప్రారంభించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ సుంకర అజయ్కుమార్, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ. లింగారెడ్డి, పుల్లారెడ్డి, యుగంధర్రెడ్డి పాల్గొన్నారు. చిలుకూరు మండలం నారాయణపురంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాన్ని ఎంపీపీ బండ్ల ప్రశాంతికోటయ్య, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీషానాగేంద్రబాబు ప్రారంభించారు. జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జానీమియా, తాసీల్దార్ రాజేశ్వరీదేవి, ఎంపీడీఓ ఈదయ్య, సర్పంచ్ శంకర్, ఎంపీటీసీ శైలజ, సురేశ్బాబు పాల్గొన్నారు. నారాయణపురం, బేతవోలులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా సంఘాల చైర్మన్లు కొండా సైదయ్య, సైదులు ప్రారంభించారు.
ఇవీ కూడా చదవండీ…
వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టాలి : డీఎంహెచ్వో
అంతర్జాతీయ జర్నల్లో మన పోలీస్ ఆర్టికల్
లైంగిక దాడి కేసులో నిందితుడి ఆత్మహత్య