ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, పోలీసుల తనిఖీలు
నిర్మానుష్యంగా రోడ్లు
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు
మధ్యాహ్నం ఒంటి గంట లోపే దుకాణాల మూసివేత
సహకరిస్తున్న ప్రజలు, వ్యాపారులు
జిల్లాలో 26వ రోజు లాక్డౌన్ ప్రశాంతం
మోటకొండూర్, జూన్ 6: కొవిడ్ కట్టడికోసం ప్ర భుత్వం విధించిన లాక్డౌన్ను మండలంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కట్టుదిట్టం గా అమలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేశారు. మధ్యా హ్నం రెండు గంటల తర్వాత ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారా యి. మండల కేంద్రంతోపాటు పలు గ్రా మాల్లో ఎస్ఐ నాగరాజు లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు.
లాక్డౌన్కు సహకరించాలి
ఆలేరు టౌన్, జూన్ 6: ఆలేరు పట్టణంలో లాక్డౌన్ 26వ రోజు ప్రశాంతంగా జరిగింది. ఈ సం దర్భంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేసి అత్యవసర వాహనాలకు అనుమతించి , మిగిలిన వాహనదారులకు జరిమానా విధించారు. మధ్యా హ్నం 2గంటల తర్వాత ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో ప్రధాన, అంతర్గత రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఎస్ఐ రమేశ్ కోరారు.
నిబంధనలు పాటించాలి
ఆత్మకూరు(ఎం), జూన్6: లాక్డౌన్ నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని ఎస్ఐ ఎండీ.ఇద్రిస్ అలీ అన్నారు. వ్యాపారులు మధ్యాహ్నం ఒంటి గంట లోపే తమ షాపులను మూసేయాలన్నారు. ఆదివారం మం డల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది.
వాహనాల తనిఖీ
తుర్కపల్లి, జూన్6 : మండల కేంద్రంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం లాక్డౌన్ ప్రశాంతంగా జరి గింది. ఉదయం 6నుంచి 1గంట వరకు వ్యాపారు లు షాపులను తెరిచి ఉంచారు. లాక్డౌన్ సమ యంలో రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహించి చలానాలు విధించారు.
లాక్డౌన్కు సహకరిస్తున్న వ్యాపారులు
రామన్నపేట, జూన్6: మండలంలో లాక్డౌన్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటలోపే వ్యాపారులు షాపులను మూసి వేశారు. రెండు గంటల తర్వాత ప్రజలు బయ ట కు రాకపోవడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారా యి. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి లాక్డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
సడలింపు సమయంలో నిత్యావసరాల కొనుగోలు
సంస్థాన్ నారాయణపురం, జూన్6: మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. ప్రజలు ఆదివారం ఉద యం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిత్యావసరాలను కొనుగోలు చేశారు. గుడిమల్కాపురం చెక్పోస్టు వద్ద లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిపై, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మోత్కూరు, గుండాల మండలాల్లో ..
మోత్కూరు, జూన్ 6: మోత్కూరు, గుండాల మండలాల్లో లాక్డౌన్ 26వ రోజు ప్రశాంతంగా జరిగింది. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజలు సడలింపు సమయంలో నిత్యావసరాలను కొనుగోలు చేశారు. భువనగిరి, నల్లగొండ, తిరుమలగిరి రూట్ల నుంచి రాకపోకలు సాగించిన వాహనాలను పోలీసులు తనిఖీ చేసి మినహాయిం పు ఉన్న వాహనాలను అనుమతించి మిగితా వాహనదారులపై జరిమానా విధించారు. గుం డాల మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానా విధించారు. జనగా మ, దేవరుప్పుల, మోత్కూరు, ఆలేరు ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించిన వాహనాలను పోలీసులు తనిఖీలు చేసి లాక్డౌన్ నిబంధనలు పాటించని బైక్లను సీజ్ చేసి కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు ఎస్ఐ ఉదయ్కిరణ్ తెలిపారు.
మండలంలోని పోడిచేడు గ్రామంలో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా రామన్నపేట సీఐ రాజు పర్యవేక్షణలో గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ మధు కొవిడ్ బాధిత కు టుంబాలకు నిత్యావసరాలను పంచాయతీ సి బ్బంది ద్వారా పంపిణీ చేశారు. మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సుందరయ్యకాలనీలో కొవిడ్ బారిన పడి తండ్రిని కోల్పోయి, తల్లికి కూడా వైరస్ సోకి అస్వస్థత పాలైన కుటుంబానికి దాతలు సహకారం అందించారు. అదే కాలనీలో కొవిడ్తో మృతి చెందిన మరో కుటుంబానికి మన మోత్కూరు వాట్సాప్ గ్రూపు నిర్వాహకులు సేక రించిన విరాళాలు రూ.31వేలను బాధిత కుటుంబానికి అందించారు. గుండాల మండలంలోని పెద్దపడిశాలలో మృతి చెందిన రెండు కుటుంబాలకు బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయా న్ని అందించారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు, జూన్ 6 : మండలంలో 26వ రోజు లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించారు. ప్రజ లు సడలింపు సమయంలో నిత్యావసరాలను కొనుగోలు చేసి ఇండ్లకే పరిమితం కావడంతో మండలంలోని ప్రధాన, అంతర్గత రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
వాహనదారులకు జరిమానా
చౌటుప్పల్ రూరల్, జూన్6 : మండల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 93 మంది వాహనదారులకు ఆదివారం రూ.48,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ ముని తెలిపారు. ఉల్లంఘించిన వారిలో 62మంది ఫోర్వీలర్స్ డ్రైవర్లు, 41 మం ది ద్విచక్ర వాహనదారులు ఉన్నారన్నారు. అంతేకాకుండా మాస్కులు ధరించని 47 మంది వాహ నదారులపై, రెండోసారి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 23మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.