హుజూర్నగర్ ఏడీఏ సంధ్యారాణి
మేళ్లచెర్వు/ చింతలపాలెం, జూన్ 5: నకిలీ విత్తనాలు అమ్మితే జైలు తప్పదని హుజూర్నగర్ ఏడీఏ సంధ్యారాణి, కోదాడ రూరల్ సీఐ శివరాంరెడ్డి హెచ్చరించారు. మేళ్లచెర్వు, చింతలపాలెం మం డలంలోని దొండపాడు, గుడిమల్కాపురం, చింతలపాలెం గ్రామాల్లోని విత్తనాల దుకాణాలను శనివారం వారు ఆకస్మిక తనిఖీ చేశారు. అనుమతించిన విత్తనాలు మాత్రమే అమ్మకాలు చేయాలని,స్టాక్ వివరాలు, రికార్డులు తప్పక నమోదు చేయాలని సూచించారు. రైతులందరూ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని, ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి నకిలీ విత్తనాలు కొని మోసపోతే సంబంధిత షాపు డీలర్పై చర్యలు తీసుకోలేమని తెలిపారు. వారి వెంట ఏఓలు పెద్ది శ్రీనివాస్గౌడ్, జావీద్, ఎస్ఐ నరేశ్ ఉన్నారు.
నేరేడుచర్ల : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతు న్న నేపథ్యంలో నేరేడుచర్ల పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఎస్ఐ యాదవేంద్రరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వ్యాపారులు నకిలీ విత్తనాలకు తావులేకుండా స్వచ్ఛమైన, నా ణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. ఏఈఓ అవినాశ్ ఉన్నారు.
మునగాల : మండల కేంద్రంలో పలు ఎరువుల దుకాణాలను ఏడీఏ వాసు, సీఐ ఆంజనేయులు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీలర్లు తప్పకుండా స్టాక్ బోర్డు రైతులకు కనిపించే విధంగా దుకాణం వెలుపల ఏర్పాటు చేయాలని సూచించారు. కొనుగోలు సమయంలో రైతులకు తప్పకుండా బిల్లు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాసులు, ఏఓ అనిల్కుమార్, విస్తరణ అధికారి ఉప్పయ్య పాల్గొన్నారు.