హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి
హుజూర్నగర్టౌన్, జూన్ 5: కరోనా సమయంలో పేదలకు సాయం చేయడం అభినందనీయమని హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి అన్నారు. అపరంజి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం కోర్టులో పని చేసే పారిశుధ్య కార్మికులు, గుమస్తాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. తనవంతు సాయంగా కోర్టులో పని చేసే కార్మికులు రూ. 5000 ప్రకటించారు. కార్య క్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు కాల్వ శ్రీనివాస్రావు, చల్లా కృష్ణయ్య, సైదులు, నాగార్జున, చంద్రయ్య, యాదగిరి, మహేశ్, సురేశ్, రమణారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ కాశయ్య పాల్గొన్నారు.