కేవీకే సెక్రటరీ ఘంటా సత్యనారాయణరెడ్డి
గరిడేపల్లి, జూన్ 5: జీవ వైవిధ్య సమతుల్యత పర్యావరణంపైనే ఆధారపడి ఉంటుందని పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్య తని గడ్డిపల్లి కేవీకే సెక్రటరీ ఘంటా సత్యనా రాయణరెడ్డి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం కేవీకేలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూమిపై ఉన్న సకల జీవరాశులకు మూలాధారం చెట్లేనని చెట్ల పెంపకంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు దొంగరి నరేశ్, సీహెచ్.నరేశ్, అరిగెల కిరణ్, టి.మాధురి, ఎన్.సుగంధి పాల్గొన్నారు.
స్ఫూర్తి యువజన సంఘం ఆధ్వర్యంలో..
పొనుగోడు గ్రామంలో స్ఫూర్తి యువజన సంఘం ఆధ్వర్యంలో ముత్యాలమ్మ దేవాలయ ఆవరణలో సంఘం అధ్యక్షుడు అనంతు కర్ణాకర్ ఆధ్వర్యంలో తులసీ, పూల మొక్కలను నాటారు. కార్యక్రమంలో రాం సైదులు, సంఘం ప్రధాన కార్యదర్శి బత్తిని శివ, సభ్యులు ఉమేశ్, లక్ష్మారెడ్డి, నరేశ్, నాగరాజు, సైదులు పాల్గొన్నారు.
‘మై హోం’ లో
మేళ్లచెర్వు : స్థానిక మైహోం ఇండస్ట్రీస్ ఆవరణలో ప్లాంట్ హెడ్ శ్రీనివాస్రావు మొ క్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో డీజీఎం పార్థసారథి, మైన్స్ హెడ్ శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంట్ హెడ్ హనుమాన్ ప్రసాద్ పాల్గొన్నారు.
దక్కన్ ఫ్యాక్టరీలో ..
పాలకవీడు : మండలంలోని భవానీపురం లో గల దక్కన్ ఫ్యాక్టరీలో చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఆవరణలో కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. కాలుష్య నివారణలో భాగంగా కార్మికులు, ఉద్యోగులు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమం లో ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్లు రాఘవేంద్రవర్మ, నాగ మల్లేశ్వర్రావు, మస్తాన్, డీజీఎంలు కళ్యాణ్చక్రవర్తి, శ్రీనివాస్రావు, ఏజీఎంలు రమణారావు, నర్సింహారావు,
తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో..
కోదాడ రూరల్ : కోదాడ 29వ వార్డులో టీఆర్ఎస్ నాయకుడు వనపర్తి లక్ష్మీనారాయణ మొక్క నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కట్టెబోయిన రమాశ్రీనివాస్, కట్టెబోయిన శ్రీనివాస్యాదవ్, లలిత, పెం డెం వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కార్యా లయ ఆవరణలో ఎంపీపీ చింతా కవితారెడ్డి మొక్కలు నాటారు