బొడ్రాయిబజార్, ఏప్రిల్2 : సూర్యాపేట మున్సిపాల్టీలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీడీఎంఏ(పురపాలక పరిపాలనాశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్) సత్యనారాయణ ఆదేశించారు. మున్సిపాల్టీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా బాలెంల డంపింగ్యార్డుకు వెళ్లిన ఆయన సెగ్రిగేషన్ షెడ్డు, బాలెంలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్డబ్ల్యూఎం సెగ్రిగేషన్ అండ్ ప్రాసెసింగ్ యంత్రాన్ని పరిశీలించారు. చెత్తను వేరు చేయడంతో పాటు దాని ద్వారా తయారు చేసే వివిధ ఉత్పత్తుల ద్వారా పొందే ఆదాయం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలమర్రి వద్ద ఏర్పాటు చేసిన నర్సరీని, మినీ ట్యాంక్బండ్ను సందర్శించారు. గణేశ్నగర్లో అమృత్ నిధులతో నిర్మించిన పార్క్ను పరిశీలించారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల కేంద్రాన్ని పరిశీలించారు.
రెండు మార్కెట్ల ఏర్పాటుకు నిధులు
పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని సీడీఎంఏ సత్యనారాయణ పరిశీలించారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో అదనంగా రెండు మార్కెట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. జమునానగర్ డంపింగ్యార్డును పరిశీలించి సేంద్రియ ఎరువు, ప్లాస్టిక్ ఇటుకల తయారీని పరిశీలించారు. దురాజ్పల్లిలో నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్ను, లక్ష్మీనగర్ టౌన్షిప్లో ఏర్పాటు చేసిన చిట్టడవిని పరిశీలించి మొక్కలు నాటారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు ఎస్కే.బాషా, ఈఈ జీకేడీ ప్రసాద్, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, డీఎంసీ రమేశ్నాయక్, ఆర్ఐలు శివరాంరెడ్డి, ఎండీ గౌసొద్దీన్, ప్రసాద్, ఏఈలు సుమంత్, రాజిరెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
సిక్కింలో చైనీస్ ఆర్మీ.. రోడ్లు, పోస్ట్ల నిర్మాణం
చిన్నారులపై ‘ఫైజర్’ క్లినికల్ ట్రయల్స్
సీఏఏపై వీగిన ‘షికాగో’ తీర్మానం
2022 చివరి నాటికి సాధారణ పరిస్థితులు : బిల్ గేట్స్
2030 కల్లా ఎగురనున్న హైబ్రిడ్ ట్రైప్లేన్
పుతిన్కు వ్యాక్సిన్.. ఫొటో విడుదల చేయకపోవడంపై అనుమానాలు