కోదాడటౌన్, ఏప్రిల్ 2 : పట్టణంలోని అనంతగిరి రోడ్లో గల లింగమంతుల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆలయ మహా మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం దాతలు మండల సురేశ్ రూ.5 లక్షలు, రామనబోయిన లింగమ్మ రూ.5 లక్షలు, ముసుగు శ్రీనివాస్రెడ్డి రూ.3లక్షలు, వేనేపల్లి శ్రీనివాస్రావు రూ.లక్షా 16వేలు, కందరబోయిన వేలాద్రి రూ.లక్ష చెక్కులను ఎమ్మెల్యేకు అందించారు. కార్యక్రమంలో ఈదుల కృష్ణయ్య, గుండెల సూర్యనారాయణ, మాదాల ఉపేందర్, కందుల కోటేశ్వర్రావు, గంధం యాదగిరి, లంకెల నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు
కోదాడటౌన్ : బార్ అసోసియేషన్ను అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నూతన బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున, ప్రధాన కార్యదర్శి నాలం రాజన్న, గాలి శ్రీనివాస్నాయుడు, నయీం, మోష, ధనమూర్తి, దుర్గ, శేఖర్, కోదండపాణి పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
యూకే లోక్సభ మాజీ సభ్యుడు హరిదాస్ కన్నుమూత
లిబియాలో విరుచుకుపడుతున్న ఇసుక తుఫాన్లు
బ్రెజిల్లో ఒక్కరోజే 3 వేలకుపైగా కరోనా మరణాలు..!
ఆందోళన కలిగిస్తున్న కొవిడ్ ఆర్-ఫ్యాక్టర్
ఇక బిట్కాయిన్తో టెస్లా కారు కొనొచ్చు
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి