మఠంపల్లి, జూన్ 1 : నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయాధికారి బుంగా రాజు అన్నారు. మండలంలోని పెదవీడులో ఎరువులు, విత్తనాల దుకాణాలను ఎస్ఐ సుందరయ్యతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలన్నారు. నాసిరకం విత్తనాలు అమ్మినా, మధ్యవర్తుల ద్వారా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, దాచేపల్లి, రెంటచింతల ప్రాంతాల నుంచి నాసిరకం విత్తనాలు మన రాష్ట్రంలోకి వస్తున్నాయని ముందస్తు సమాచారంతో మట్టపల్లి బ్రిడ్జి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులు ప్యాకెట్ల రంగులు చూసి మోసపోవద్దని సూచించారు. నకిలీ విత్తనాలపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు.
లైసెన్స్ డీలర్ల వద్ద కొనుగోలు చేయాలి
మునగాల : వ్యవసాయ శాఖ నుంచి లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేయాలని ఏఓ అనిల్కుమార్ సూచించారు. వ్యవసాయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం పంటకు విత్తనాలు కొనుగోలు చేసే సమయం ఆసన్నమైనదని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకుని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో ఏఈఓలు ఉప్పలయ్య, భవానీ, ముస్తఫా పాల్గొన్నారు.
కొనుగోలు చేసిన విత్తనాలకు రశీదు తీసుకోవాలి
చింతలపాలెం : రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పక రశీదు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి షేక్ జావీద్ అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు విత్తనాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు గ్రామాల్లోకి వచ్చి విక్రయించే వారి వద్ద కొనుగోలు చేయవద్దని తెలిపారు. విత్తనాలు, ఎరువులను ఎమ్మార్పీ కంటే ఎక్కువకు ఱెషుకయిస్తే దుకాణాదారులపై చట్టరీత్యా చర్యలు తప్పవని