పాలకవీడు, జూన్ 1 : ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఎస్ఐ నరేశ్ అన్నారు. మండల కేంద్రంలో పాలకవీడు యూత్ ఆధ్వర్యంలో 120 మంది పేదలకు నిత్యావసర సరుకులు, మాస్క్లు, శానిటైజర్లు మంగళవారం ఆయన పంపిణీ చేశారు. అలాగే గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తాళ్లపల్లి చిన్నప్ప కుటుంబ సభ్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి యరెడ్ల సత్యనారాయణరెడ్డి, ఉప సర్పంచ్ కొండా శ్రీను, వార్డు సభ్యుడు అచ్చయ్య, టీఆర్ఎస్ నాయకులు జాన్రెడ్డి, రాములు, యూత్ సభ్యులు వెంకటేశ్వర్లు, ప్రసన్న, సురేశ్, మనోజ్, మహేశ్, వంశీ, గురువయ్య, అన్వేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం
కోదాడ రూరల్ : మిత్రమండలి ఆధ్వర్యంలో పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ ప్రముఖ వైద్యుడు జాస్తీ సుబ్బారావు, రామారావు మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, మిత్రమండలి అధ్యక్షుడు మేకల వెంకట్రావ్, గౌరవ సలహాదారులు ముత్తవరపు పాండురంగారావు, రావెళ్ల సీతరామయ్య, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు, ముత్తవరపు రామారావు, సైదేశ్వర్రావు, ఓరుగంటి పాండు, కోటేశ్వర్రావు పాల్గొన్నారు.
ఆశ కార్యకర్తలకు నిత్యావసర సరుకులు
హుజూర్నగర్ టౌన్ : హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున ఏడుగురు ఆశ కార్యకర్తలకు బియ్యం, కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులను మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యుడు కైఫ్ మాట్లాడుతూ ఆశ కార్యకర్తలు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
గరిడేపల్లి : మండలంలోని కుతుబ్షాపురంలో సర్పంచ్ నల్లపాటి వీరమ్మాభాస్కర్ పంచాయతీ సిబ్బందితో సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించారు. అలాగే కోదండరామాపురం, గరిడేపల్లి గ్రామాల్లో సర్పంచులు రవీందర్రెడ్డి, సీతారాంరెడ్డి ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కార్యదర్శి సొనేర్, సిబ్బంది పాల్గొన్నారు.
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని బూరుగడ్డ, మాచవరం గ్రామ వీధుల్లో సర్పంచ్ సలీమా బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య పనులు చేస్తున్న సిబ్బందితోపాటు మరో ముగ్గురు యువకులు బ్లీచింగ్ చల్లారని తెలిపారు.
మాస్క్లు, శానిటైజర్ల పంపిణీ
మోతె : మండలంలోని నామవరంలో పంచాయతీ నిధుల నుంచి ప్రజలకు శానిటైజర్లు, మాస్క్లను ఎంపీఓ హరిసింగ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తండాయాదమ్మ మల్సూర్, ఎంపీటీసీ దైద పున్నమ్మ, ఏపీఓ వెంకన్న, ఈసీ శ్రీనివాస్, టీఏలు పాల్గొన్నారు.
పంచాయతీ సిబ్బందికి పీపీఈ కిట్లు
చిలుకూరు : గ్రామపంచాయతీ సిబ్బందికి వార్డు సభ్యులు ముక్కా లక్ష్మీనారాయణ, బాలెబోయిన రవి అందజేసిన పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లను ఎంపీడీఓ ఈదయ్య, ఎంపీఓ నరసింహారావు, సర్పంచ్ కొడారు బాబు పంపిణీ చేశారు. గ్రామ కార్యదర్శి శోభన్బాబు, బిల్ కలెక్టర్ ధర్మయ్య పాల్గొన్నారు.
పొనుగోడు హెల్త్కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో..
గరిడేపల్లి : పొనుగోడు హెల్త్కేర్ ఆర్గనైజేషన్ (ఎన్ఆర్ఐలు, డాక్టర్లు, ఉద్యోగులు) ఆధ్వర్యంలో గ్రామంలో వైద్యసిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం మూడో రోజు మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా గ్రామస్తులకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన వారికి ఎన్-95, మాస్క్లు, శానిటైజర్లు, మెడికల్ కిట్లను కల్మల్చెర్వు వైద్యాధికారి కె.సుధీర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జోగు అరవిందరెడ్డి అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన వైద్యాధికారి నక్క రవి కరోనా వైరస్ను అరికట్టేందుకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. గ్రామంలో మొత్తం 50 మందికి పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి తెలిపారు. కార్యక్రమంలో మేకల సందీప్, బొలిశెట్టి సతీశ్, రాకేశ్, సుందరి గిరి, ఏఎన్ఎం సునీత పాల్గొన్నారు.