సూర్యాపేట, ఏప్రిల్1 :యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ఏర్పాటు చేసే కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మోహన్రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సూచనల మేరకు కరోనా నిబంధనలు పాటిస్తూ కొనుగోళ్లు జరుపాలని సూచించారు. త్వరలోనే జిల్లాలో 327 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో ఐకేపీ ద్వారా 188, పీఏసీఎస్ ద్వారా 134, వ్యవసాయ శాఖ ద్వారా 5 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని 17 శాతం తేమ ఉండేలా ఆరబెట్టుకొని తేవాలని సూచించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి రూ.1888లు, బీ గ్రేడ్కు రూ.1868 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. యాసంగిలో 5,01,550 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం రవాణాకు కావాల్సిన లారీలను సిద్ధంగా ఉంచాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధ్ది శాఖ అధికారి కిరణ్కుమార్, డీసీఓ శ్రీనివాసులు, తూనికలు కొలతల అధికారి వెంకటేశ్వర్లు, డీఏఓ రామారావు నాయక్, సివిల్ సప్లయ్ డీఎం పుల్లయ్య, మార్కెటింగ్ ఏడీ సంతోష్, డీటీ రాజశేఖర్, మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
గణనీయంగా తగ్గిన శబరిమల భక్తుల సంఖ్య, ఆదాయం
బంగారం కోసం కేరళ ప్రజలకు ఎల్డీఎఫ్ ద్రోహం : మోదీ