తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 1 : జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని, యువ నాయకుడు భగత్ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం కంటే వేసిన నామినేషన్ను ఉపసంహరించుకోవడమే మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. గురువారం మండలంలోని నేతాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. 40 ఏళ్లు రాజకీయాల్లోఉన్న జానారెడ్డి నాలుగుసార్లు మంత్రిగా పనిచేసి సాగర్ అభివృద్ధికి అడ్డుగా నిలిచారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఓటర్లు జానారెడ్డిపై తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. నేతాపురం, శీతలతండా, ధన్సింగ్తండాలో ప్రధాన సమస్యగా ఉన్న వాగుపై వంతెన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, మండల ఎన్నికల ఇన్చార్జి జాజాల సురేందర్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ సూర్య బాషానాయక్, పిడిగం నాగయ్య, భిక్షానాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.