త్రిపురారం, ఏప్రిల్ 1 : నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతున్నది. గురువారం ఒక్కరోజే త్రిపురారం మండలంలో 350 మంది నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. త్రిపురారం మాజీ ఎంపీటీసీ మజ్జిగపు శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో 60మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్ధాంతి కృష్ణ తన అనుచరగణంతో పార్టీలో చేరారు. సత్యనారాయణఫురం, నీలాయిగూడెం, అంజనపల్లి, కుంకుడుచెట్టు గ్రామాల నుంచి విరివిగా వలసలు కొనసాగాయి. వారందరికీ ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాణోతు శంకర్నాయక్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి వెంట రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, నిడమనూరు మార్కెట్ చైర్మన్ జానయ్య, మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, నాయకులు మర్ల చంద్రారెడ్డి, పెద్దబోయిన శ్రీనివాస్, రామచంద్రయ్య, కలకొండ వెంకటేశ్వర్లు, మడుపు వెంకటేశ్వర్లు ఉన్నారు.
తిరుమలగిరి(సాగర్)లో..
తిరుమలగిరి సాగర్, ఏప్రిల్ 1 : మండలంలోని నాయకునితండాకు చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, జాజాల సురేందర్, శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో మండల కేంద్రంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సాగర్ ఉప ఎన్నికలో నోముల భగత్ కోసం కృషి చేయాలని కోరారు. ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్లూరు రాజశేఖర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిడమనూరులో..
నిడమనూరు : మండల కేంద్రంలో వర్ధన్నపేట, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 15కుటుంబాలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలతో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో పెరుమాళ్ల శ్రీను, బొజ్జ లక్ష్మీనారాయణ, వింజమూరి రామచంద్రు ఉన్నారు.ముకుందాపురం గ్రామంలో రైతుబంధు సమితి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు యల్లవల్ల లలితాయాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షేక్ ఖాశీం ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యల్లవల్ల కుమార్యాదవ్, సర్పంచ్ కేశ శంకర్, నాయకులు రాం అంజయ్యయాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు వంగాల వెంకన్న, ఘనపాటి బుచ్చిరెడ్డి, ముద్ద బక్కయ్య, వార్డు సభ్యుడు ఆవుల కృష్ణ పాల్గొన్నారు.
నాయుడుపాలెం గ్రామంలో..
హాలియా : అనుముల మండలం నాయుడుపాలెం గ్రామంలో గురువారం వివిధ పార్టీలకు చెందిన 100మంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
హిల్కాలనీలో..
నందికొండ : ఉప ఎన్నిక నందికొండ ఇన్చార్జి, కరీంనగర్ మేయర్ యాదగరి సునీల్రావు, సుడా చైర్మన్ గూడువీర రామకృష్ణ సమక్షంలో నందికొండ హిల్కాలనీలో 50కుటుంబాలకు చెందిన మత్స్యకారులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో దేవుడు, శివ, వెంకటేశ్, జెగ్గ, యంగరాజు, రవి, చిట్టి, అప్పలరాజు, అఖిల్, రాజు, చరణ, అప్పన్న, గాలిరాజు, నాగరాజు, రమణ, వెంకటేశ్వర్లు, స్వామిలకు చెందిన కుటుంబాలు టీఆర్ఎస్లో చేరారు.
ఇవీ కూడా చదవండీ..
కరోనా కొత్త వేవ్.. 20-39 మధ్య వయస్కులపై ప్రభావం!
40 మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్