తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దృష్ట్యా సూక్ష్మ సేద్యానికి సబ్సిడీపై రైతులకు యంత్ర పరికరా లు మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను మొదటి విడుత లో జిల్లాకు ఉద్యానవన శాఖ ద్వారా 375యూనిట్లు సూక్ష్మ సేద్యం పరికరాలు మంజూరయ్యాయి. నీటిని పొదుపుగా వాడుతూ వివిధ పంటల సాగుతో అధిక దిగుబడులు సాధించాలంటే ప్రస్తుత తరుణంలో బిందు, తుంప, పాలీషిడ్, పందిరి సాగు పద్దతులను సాగుకు మేలైన పద్దతులు. ఈ సాగు విధానంతో సూక్ష్మ సేద్య పరికరాల ద్వారా పంటలకు అవసర మైన మేరకు నీటిని అందించవచ్చు.
దీంతో భూగర్భజలాలు ఎక్కువగా దెబ్బ తినకుండా ఉంటాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో బిందు, సూక్ష్మ సేద్యం ద్వారా పంటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ చిన్న సన్నకారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాయితీ లపై సబ్సిడీ మంజూరు చేసింది. దీనిలో 325యూనిట్లు బిందు సేద్యం, 50యూనిట్ల కు గాను తుంపర సేద్యం పరికరా లు జిల్లాకు మం జూరయ్యాయి. రైతులకు ఒక్కో హెక్టారుకు ఒక్కో యూనిట్గా ఇస్తున్నారు. సూక్ష్మసేద్య పరికరాలు కావా ల్సిన రైతులు మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది.
యంత్ర పరికరాలపై సబ్సిడీ విధానం
రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2002 సంవత్సరంలో సూక్ష్మ సేద్య పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఐదెకరాల్లోపు ఉన్న చిన్న సన్నకారు బీసీ రైతులకు 90శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం రాయితీ, ఐదెకరాలు పై బడిన రైతులకు 80శాతం రాయితీని ప్రభుత్వం కల్పిస్తుంది.
రైతులు సబ్సిడీ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి: స్రవంతి(మండల ఉద్యానవనశాఖ అధికారి)
సబ్సిడీపై యంత్ర పరికరాలు కావాలనుకునే రైతులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. వాటిని పరిశీలించి రైతులకు ఒక్కో యూనిట్ లబ్ధి పొందేలా సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ యంత్రాలతో సాగు విధానంలో తక్కువ నీటిలో అధిక దిగుబడి సాధించవచ్చు.
సబ్సిడీతో కూరగాయలు సాగు చేశాను :వెలుగు సైదులు(రైతు, కర్విరాల)
ప్రభుత్వం రైతులు కూరగాయలు సాగు చేసే వారికి కావాల్సిన యంత్ర పరికరాలతో పాటు ప్రత్యేకంగా పందిరి సాగు కోసం ప్రత్యేక సబ్సిడీ అందిస్తుంది. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.