సూర్యాపేట: ఎగువన వర్షాలు కురుస్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తి నిండిపోయింది. దీంతో అధికారులు మొత్తం ఏడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హెచ్చరించారు. గేట్లు ఎత్తడంతో ఉధృతంగా ప్రవహించే నీటితో ప్రమాదం ఉందని, ఎవరూ చేపల వేటకోసం నదిలోకి వెళ్లొద్దని సూచించారు.
ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుంటంతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 642.5 ఫీట్లుకాగా, ప్రస్తుతం 645 ఫీట్ల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టులోకి 5,500 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,400 క్యూసెక్కుల నీరు బయటకి వెళ్తున్నది.