నేరేడుచర్ల: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలను పునఃప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం నేరేడుచర్ల పట్టణంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. పాఠశాలలో ప్రత్యేక్ష తరగతుల నిర్వహణపై ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులు సమాచారం అందించాలన్నారు. ప్రతి విద్యార్ధి తరగతి గదుల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాల ఆవరణలోకి వచ్చిన వెంటనే శానిటైజర్తో చేతులను శుభ్రం చేయిం చాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో ఎలాంటి చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
త్రాగునీరు, మురుగుదొడ్ల నిర్వహణపై ప్రధానోపాధ్యాయులు ఎల్. శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశా లలో మురుగు నీటితో నిండి ఉన్న బోరును పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, కేసుల నమోదు వివరాలను జిల్లా మలేరియా అధికారి సాహితిని అడిగి తెలుసుకున్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ఏ చర్యలు తీసుకుంటున్నారనే విషయమై మున్సిపల్ కమిషనర్ గోపయ్యను అడిగి వివరాలు తెలుసుకు న్నారు. సీజనల్ వ్యాధులు విస్తరించే ప్రమాదం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీపీవో యాదయ్య, మున్సిపల్ చైర్మన్ జయబాబు, ఎంపీవో విజయకుమారి, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రత్యక్ష తరగతులకు ఎటువంటి ఆంటకం లేకుండా చూడాలి
గరిడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలలను పునః ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నందున అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు చేపట్టి విద్యార్థులకు ప్రత్యక్ష తరగతుల నిర్వాహణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాల ఆవరణ, తరగతి గదుల్లో ఎటువంటి చెత్తా, చెదారం లేకుండా శుభ్ర పరచాలన్నారు.
అలాగే సోడియం హైపో క్లోరైడ్ను పిచికారి చేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్య పనులపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి పెట్టాలన్నారు. కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ తప్పక మాస్క్లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని వైద్యసిబ్బందికి సూచించారు. ఈయన వెంట డీపీవో యాదయ్య, గ్రామ సర్పంచ్ సీతారాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి భద్రయ్య, ఎస్ఎంసీ చైర్మన్ నగేశ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.