నేరేడుచర్ల: రాష్ట్రంలో జరుతున్న అభివృద్ధిని కండ్లుండి చూడలేని కబోదులుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని రాజ్య సభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పక్షాలు ప్రజాస్వామ్య విలువలు కోల్పోతున్నా యని, ఓటుకు నోటులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి, సక్రమంగా మాటలే రాని బండి సంజయ్ లాంటి వారు ప్రతిపక్ష నేతలుగా ఉండడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమన్నారు.
అద్భుతమైన సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్పై అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేయ డం సమంజసం కాదన్నారు. ఈ నెల 2న ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రజల సమస్యలపై దేశ ప్రధానిని కలవడాన్ని సైతం విమర్శించడం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. విభజన నిధులు, జీఎస్టీలో వాటా, జాతీయ రహదారుల విస్తరణ, మరమ్మత్తులు తదితర విషయాలపై ప్రధానమంత్రితో పాటు సంబంధిత శాఖల కేంద్ర మంత్రులతో భేటి కావడం జరిగిందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతు న్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ఇంటింటికీ ఏదో ఒక తీరుగా చేరిన విషయం విస్మరించరాదన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలు ఉన్నాయ న్నారు. తాజాగా పార్టీ సంస్థాగత ఎన్నికలు 50 శాతం పైగా పూర్తయ్యాయన్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు మండ ల కమిటీలు, అనంతరం జిల్లా కమిటీలను ఎంపిక జరుగుతుందన్నారు. అన్ని కమిటీలలో 50 శాతం పైగా బలహీన వ ర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
నేరేడుచర్ల మండలంలో గ్రామ గ్రామాన జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల తీరును అడిగి తెలుసుకున్నా రు. అనంతరం మాజీ మర్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశెట్ల రమేశ్బాబు ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడగా ఆయన గృహా నికి వెళ్లి పరామర్శించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు చింతకుంట్ల సోమిరెడ్డి, చల్లా శ్రీలత రెడ్డి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, కౌన్సిలర్లు సాయి, కల్లూరు గ్రామ సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, నాయకులు అరిబండి సురేశ్బాబు, ఇంజమూరి రాములు, ఆకారపు వెంకటేశ్వర్లు, రాజు ఉన్నారు.