నేరేడుచర్ల: దళితుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితుందరూ అండగా నిలవాలని ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్యలు పిలుపు నిచ్చారు. దళితులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షిస్తూ బుధవారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి ప్లెక్సీకి టీఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన కూడలి వద్ద క్షీరాభిషేకం చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయలేదన్నారు.
దళిత బాంధవుడు సీఎం కేసీఆర్ అని, దళితులందరూ సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు. కార్యక్ర మంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇంజమూరి యశోధ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు వస్కుల సుదర్శన్, కల్లూరు, ఫత్తె పురం గ్రామ సర్పంచ్లు పల్లెపంగు నాగరాజు, మచ్చ పాపయ్య, నాయకులు నందిపాటి గురవయ్య, లంకెపల్లి నాగార్జున, ఇంజమూరి శ్రీను, నందిపాటి హిందూజ, ఇంజమూరి రాజేశ్, రాంబాబు, సైదులు, నాగరాజు, సోమయ్య, వీరబాబు, వీరస్వామి పాల్గొన్నారు.