కేతేపల్లి: రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో మూసీ ప్రాజెక్టు 6 క్రస్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతా ల నుంచి బుధవారం 17735.33 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా దిగువకు 16747.01 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కుడి , ఎడమ కాలువలకు 219.76 క్యూసెక్కుల నీరు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగు లు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 638.85 అడుగులుగా (2.96 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు.