సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల ఛాయా చిత్ర ప్రదర్శనను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. దేశ స్వతంత్య్ర సంగ్రామం ప్రారంభమై 75 ఏండ్లు నిండిన సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ , ఫీల్డ్ పబ్లిసిటీ నల్గొండ యూనిట్ అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాల్ల అన్నపూర్ణ, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.