మఠంపల్లి: మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదిలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్ధాని కులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కృష్ణా నది నుండి వెలికితీశారు. మృతుడు ఒంటిపై తెల్ల చొక్క , గళ్ళ లుంగీ ధరించి ఉన్నాడని, వయస్సు 45 సంవత్సరాల వరకు ఉండ వచ్చని యస్ఐ రవి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు తెలిపారు.
మృతదేహానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతామన్నారు. ఆంద్ర-తెలంగాణ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతం కృష్ణా నది కావడంతో ఈ మృతదేహం ఆంధ్రా ప్రాంతానికి చెందినదా, ప్రమాదవశాత్తు పడ్డాడా లేక కావాలనే నీళ్లలో దూకాడా అనే కోణంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.