మఠంపల్లి: రాష్ట్రంలోని మారుమూల తండాలను, గ్రామ పంచాయితీలను అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీ ఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గుర్రంబోడు తండాలో మెగా పల్లె ప్రకృతివనం పనులకు శంకుస్థాపన చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రంబోడు తండా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.
అందులో భాగంగా లిఫ్టు నిర్మాణానికి రూ.10కోట్లు, 3కోట్లతో చెక్డ్యాం, పైప్ లైన్లు, రూ.50లక్షలతో మెగా పల్లెప్రకృతి వనం 10ఎకరాలలో పనులు పూర్తి అయ్యాయన్నారు. మన తండాలో మన రాజ్యంలో భాగంగా తండాలను పంచాయ తీలుగా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలన్నారు.
మండలంలోని అన్ని గ్రామ పంచాయితీల్లో పెండింగ్ పనులను అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు మండలంలోని కృష్ణతండాలో ఎమ్మెల్యే సొంత నిధులతో అభయాంజనేయస్వామి గుడి ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో జిల్లా పీడీ కిరణ్కుమార్, ఏపీడీ పెంటయ్య, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీపీ ముడావత్ పార్వతినాయక్, జడ్పీటీసీ జగన్నాయక్, సర్పంచ్ పార్వతి ,వైస్ ఎంపీపీ కవిత కృష్ణ, మాజీ ఎంపీపీ కొండానాయక్, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి అశోక్ నాయక్, అధికార ప్రతినిధి రమావత్ రవీందర్, ఎస్టీ సెల్ శంకర్నాయక్, ఎస్సీ సెల్ మట్టయ్య, ఫారెస్ట్ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.