సూర్యాపేట: స్నేహితుని ఇంట్లో చిన్న దావతుకు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మందు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అదికాస్తా హత్యకు దారితీసిన ఘటన సూర్యపేటలో జరిగింది. సూర్యాపేట మండలంలోని తాళ్లకంపాడుకు చెందిన నాగమల్ల నవీన్ ఇంట్లో అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకి తన మిత్రులైన మహేష్, గడ్డం పవనులను ఆహ్వానించాడు. కార్యక్రమం అనంతరం ముగ్గురూ కలిసి మందు తాగారు. ఈక్రమంలో మహేష్, పవన్ మధ్య వాగ్వాదం చోసుకుంది. కోపంతో ఊగిపోయిన మహేష్ తన చేతిలోని బీరు సీసాతో పవన్ను పొడిచాడు. దీంతో పవన్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక దవాఖానకు తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.