సూర్యాపేట : సూర్యాపే జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి లాక్డౌన్ను మరింత కఠినతరంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జిల్లా సరిహద్దుల్లో మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. జిల్లా సరిహద్దులను అన్నింటిని మూసివేయాలని పోలీసులను ఆదేశించారు. కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణలోకి రాకపోకలకు అనుమతించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. మఠంపల్లి, పులిచింతల, రామాపురం గ్రామాల వద్ద ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు
చెక్పోస్టులను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం రామాపురం క్రాస్ రోడ్డు చెక్పోస్టు మీదుగానే వాహనదారులకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణలోకి అత్యవసరంగా వచ్చే వాహనాలకు గుర్తింపు కార్డులు ఉంటేనే అనుమతిస్తాం. అంబులెన్స్లు, ఇతర అత్యవసర వాహనాలకు ఈ-పాస్ నుంచి మినహాయింపు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.