కోదాడ టౌన్: గత ప్రభుత్వాల పాలనలో ప్రజల సొమ్ముతో నాయకులు జేబులు నింపుకున్నారని, నేడు ప్రజల జేబులను నింపుతున్నామని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో కోదాడ, చిలు కూరు మండలాలకు చెందిన 62మంది లబ్ధిదారులకు కల్యా ణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆడబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ల ద్వారా తల్లిదండ్రులకు రూ.1,0,116లను వివాహ కానుకగా అందజేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీలు చింతా కవితారెడ్డి,బండ్ల ప్రశాంతి, వైస్ ఎంపీపీ మల్లెల రాణి, తహసీల్దార్లు శ్రీనివాస శర్మ, రాజే శ్వరీ దేవి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు, పట్టణ మహిళ అధ్యక్షురాలు ఇర్ల రోజా రమణి, ప్రధాన కార్యద ర్శి గట్ల కోటేశ్వరావు, మండలాధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, వెంపటి మధుసూదన్, రాయపూడి వెంకటనారాయణ, కం దుల చంద్రశేఖర్, మైసా రమేశ్, మామిడి రామారావు, ఉపేందర్ గౌడ్, పోటు రంగారావు, వంటిపులి నాగరాజు, బత్తుల ఉపేందర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.