హైదరాబాద్ : అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడ వాసి మృతిచెందాడు. సిరిపురపు రవికుమార్ అనే వ్యక్తి గత మూడేళ్ల నుంచి అమెరికాలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వారాంతపు సెలవు కావడంతో స్నేహితులతో బోటింగ్కు వెళ్లాడు. బోటింగ్ ప్రమాదంలో అక్కడే మృతిచెందాడు. రవికుమార్ మృతిపై స్నేహితులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు.