కోదాడ టౌన్: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ఉద్యోగుల పాత్ర కీలకమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు కార్యాల యంలో నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో కోదాడ మూనిట్ కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో ఉద్యోగులు భాగస్వాములు కావాలని, కోదాడ టీఎన్జీవో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాన న్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సమర్ధవంతంగా పని చేయడంతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షులు జానకిరాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి పోటు వెంకటేశ్వర్రావు, కోశాధికారి పద్మ, సెక్రటరీ రమాదేవి, వైస్ ప్రెసిడెంట్ అరుణ, రాధిక, రవి, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.