కోదాడ టౌన్: సకల విఘ్నాలను తొలగించే దేవుడు వినాయకుడు అని, నవరాత్రులను ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
గురువారం పట్ట ణంలోని విజయగణపతి దేవాలయంలో ఎన్ఆర్ఐ వెంకటేశ్వర్ రెడ్డి తన మిత్రుల ద్వారా అందించిన 1000 వినాయకుని మట్టి విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు.
కార్యక్రమంలో గణపతి దేవాలయ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య, ఆలయ కమిటీ సభ్యులు శివ, వెంకటేశ్, ఉపేందర్, పందిరి సత్యనారాయణ, కోట మధు, లక్ష్మీనారాయణ, వంగవీటి రామారావు, శ్రీధర్ పాల్గొన్నారు.