నడిగూడెం: దళితుల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం మండ ల కేంద్రంలోని కొల్లు కోటయ్య మెమో రియల్ ఫంక్షన్ హాల్లో దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. రైతు బంధు తరహాలోనే దళితులందరికీ దళిత బంధు సీఎం కేసీఆర్ అమలు చేస్తారని తెలిపారు. తరతరాలుగా అణచివేతకు గురైన దళిత జాతిలో సరికొత్త విప్లవానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
24 గంటలు కరెంట్ ఇస్తామంటే ప్రతిపక్షాలు హేళన చేశాయని, కానీ ఇప్పుడు పొరపాటున కూడా ఒక్క నిమిషం కరెంటు పోయిన దాఖలాలు కనిపించడం లేద న్నారు. దళితబంధు పథకంపై ప్రతిపక్షాలు ఎన్నో అపోహాలు, అనుమానాలను సృష్టిస్తాయన్నారు. ఈ పథకంపై దళిత నాయకులు, మేధావులు, కవులు ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు. అట్టడ గున దళితులను ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం కోసం తీసుకొచ్చిన గొప్ప పథకం దళిత బంధు పథకం అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళితులకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వాలు దళితులను ఓట్లు వేసే యంత్రాలుగా చూసారని, కానీ నేడు దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నార న్నారు. దళిత బంధు పథకం రైతు బంధు పథకం మాదిరిగా అందరికీ అందిస్తామని పేర్కొ న్నారు. అనంతరం దళితుల తో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, దళిత సర్పంచ్లు యాతాకుల వీరస్వామి, స్వరూప, నాగేశ్వరరావు, ఎంపీటీసీ గోలి సునీత, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి, ఉద్యోగుల సంఘం నాయకులు దున్నా శ్యామ్, ఈదయ్య, దాసరి శ్రీను, సుధాకర్, నాగేశ్వరరావు, మండలాధ్యక్షు డు నర్సిరెడ్డి, బడేటి చంద్రయ్య, దేవ బత్తిని సురేశ్, పాలడుగు ప్రసాద్, అనంతుల ఆంజనేయులు, ఖలీల్, వెంకన్న, ఉపేందర్, సతీశ్ పాల్గొన్నారు.