కోదాడ రూరల్: సహకార సంఘాల బ్యాంకులు వాణిజ్య బ్యాంకులకు ధీటుగా అన్నిరకాల బుణాలను రైతులకు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తన వంతు సహాయ సహకారలను అందిస్తున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పేర్కొన్నారు.
మండల పరిధి ఎర్రవరం, గణపవరం గ్రామాల్లో కోటి రుపా యల వ్యయంతో నిర్మిస్తున్న రెండు నూతన గోదాముల శంకుస్థాపన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొని మాట్లడారు. రైతులు సహకార సంఘాల రుణాలను సద్వి నియోగం చేసుకుని వారి అభివృద్ధికి తమ వంతు సహయసహకారాలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, జడ్పీటీసీ మందలపు క్రిష్ణకుమారి, జిల్లా బ్యాంకు డైరెక్టర్ కొండ సైదయ్య, పీఏసీ ఎస్ చైర్మన్లు నలజాల శ్రీనివాసరావు, ఆవుల రామారావు, సర్పంచ్లు పొట్ట శ్రీవిజయకిరణ్, వీరేపల్లి వెంకటసుబ్బా రావు, పాముల మస్తాన్, బాణోత్ అంబేధ్కర్, మండలాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్రావు, మండల కోఆఫ్షన్ సభ్యులు ఎస్కె ఉద్దండు, బుర్ర పుల్లారెడ్డి, గ్రామశాఖల అధ్యక్షులు రావుల వెంకటేశ్వర్లు, వేమూరి వరదారావు, బెల్లకొండ వెంకటే శ్వర్లు, కామిశెట్టి నర్సింహారావు, పూర్ణయ్య, వెంకటయ్య, ఎడ్లపల్లి వెంకటేశ్వరావు, వెంకట్రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.