కోదాడ: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్భాందవుడని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహయనిధి నుంచి మం జూరైన చెక్కులను పట్టణానికి చెందిన 17మంది లబ్ధిదారులకు రూ. 5,55,000లు, కోదాడ మండలానికి చెం దిన 8 మందికి రూ. 2, 23,000లు, అనంతగిరి మండలానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు రూ. 5,77, 000ల సీఎంఆర్ఎఫ్ చెక్కులతో పాటు 5గురికి కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూ ర్తి భరోసా కల్పిస్తోందన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుపేదల ప్రాణాలు నిల బడ్డాయన్నారు. కార్యక్ర మంలో ఆర్డీవో కిశోర్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, చుండూరు వెంకటే శ్వర్లు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు, నాయ కులు వనపర్తి లక్ష్మీనారాయణ, వెంపటి మధు, మధుసూ ధన్, గింజుపల్లి రమేశ్, సంపేట ఉపేందర్ పాల్గొన్నారు.