పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడటౌన్: కోదాడ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 50కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్ల య్య యాదవ్ మంగళవారం ప్రగతి భవన్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు. ఈ మేర కు మున్సిపాలిటీలోని ఎర్రకుంట చెరువు డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు.
అదేవిధంగా పట్టణంలోని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు మున్సిపాలిటీలో సిబ్బందిని పెంచా లని ఆయన కోరారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించి మున్సిపాలిటీ అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారని తెలిపారు.