హుజూర్నగర్: నియోజకవర్గ వ్యాపంగా ఉన్న అన్ని పశు వైద్యశాలలను పటిష్ట పరిచేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జిల్లా పశువైద్యాధికారి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డిని సన్మానించారు.
నియోజకవర్గ పరిధిలోని పశు వైద్యశాలలో గత మూడు సంవత్సరాలుగా స్వచ్ఛంధంగా పనిచేస్తూ పశువైద్యంలో శిక్షణ పొందిన 15 మందికి సాగర్ సిమెంట్ యాజమాన్యం ప్రతి నెలా రూ. పదివేలను గౌరవ వేతనంగా ఇచ్చేందుకు కృషి చేసినందుకు గాను ఎమ్మెల్యేకు కృతజ్ఝతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 95 పశువుల బందిల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జడ్పీటీసీ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ నేత గెల్లిరవి, పశువైద్యాధికారులు పాలొన్నారు.
కరోనా రహిత తెలంగాణకోసమే కృషి
కరోనా రహిత తెలంగాణ కోసమే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ క్యాంపును ప్రారంభించి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
అదే వార్డులోని యాదవ్ బజార్లో అయ్యప్ప యూత్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో దళపతి, కౌన్సిలర్లు శంభయ్య, గురవయ్య, అమర్నాథ్రెడ్డి, అమర్ పాల్గొన్నారు.