హుజూర్నగర్: నియోజవర్గంలో జరుగుతున్న, జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 7 మండలాలకు, రెండు మున్సిపాలిటీలకు నూతనంగా ఎంపికైన మండల, పట్టణ అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 15వేల గులాబీ సైన్యం తయారైందన్నారు. ఎంపికైన వారంతా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. అనంతరం హుజూర్నగర్ పట్టణ అధ్యక్షురాలిగా దొంతిరెడ్డి పద్మకు నియామకపత్రాన్ని అందజేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ గెల్లి అర్చన, వైస్చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చిట్యాల అమర్నాథరెడ్డి, అమర్, దొంతగాని శ్రీనివాస్, ముడెం గోపిరెడ్డి, నబీ, శ్రీలత, 7మండలాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.