హుజూర్నగర్: దేశంలో రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఎమ్మెల్కే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతలపాలెం మండలం కిష్టాపు రం గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో రాష్ర్టానికి న్యాయం జరగలేదన్నారు. సరైన నాయకుడు లేని ఆ పార్టీ పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నదన్నారు.మత విద్వేషాలు రెచ్చగొట్టే మరో పార్టీని ప్రజలు ఎప్పుడు నమ్మరని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చెందాలంటే ముఖ్య మంత్రి కేసీఆర్తోనే సాధ్యమన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో పథకాలకు మెచ్చి పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయన్నారు. పార్టీలో చేరిన వారిలో మాజీ నీటి సంఘం చైర్మన్ ఇస్మాయిల్, మాజీ ఉపాధ్యక్షుడు మౌలాలి, మాజీ చైర్మన్ జాను, రాజీ, హుస్సేన్, మహ్మద్ మరో 50 మంది కార్యకర్తలు ఉన్నారు.