చిలుకూరు: అధునాత పద్దతుల్లో చేపల పెంపకం చేపడితే మత్స్యకారులు, రైతులు అధిక లాభాలు సాధించవచ్చువని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ అక్వాకల్చర్(సీఐఎఫ్ఏ) భువనేశ్వర్ సీనియర్ శాస్రవేత్త, చైర్మన్ డాక్టర్ హెచ్.కె డే అన్నారు. మంగళవారం చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని చెన్నారిగూడెం మత్య్స సొసైటీ సభ్యులకు సీఐఎఫ్ఏ, విజయవాడలకు చెందిన షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద కార్ప్ పద్దతుల్లో ఇటీవల సాధించిన పురోగతి, చేపల పెంపకంపై మత్య్సకారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.
మంచినీటి చెరువుల్లో కార్ప్ చేపల పెంపకం చేపడితే అధిక లాభాలు సాధించవచ్చునని సూచించారు. నర్సరీ చెరువుల్లో కూడా చేపల కూడా చేపల పెంపకం చేపట్టి అధిక లాభాలు సాధించ వచ్చన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న పథ కాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తక్కువ శ్రమ,తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించవచ్చన్నారు. మారుతున్న కాలానుగుణంగా చేపల పెంపకం లో అనేక అధునాతన యాజమాన్య పద్దతులు వచ్చాయని, వాటిపై మత్స్యకారులు అవగాహన కలిగి ఉండాలని సూచిం చారు. కార్యక్రమంలో భాగంగా అనేక రకాల చేపల పెంపకం, వాటి యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు అడిగిన పలు సందే హాలను నివృతి చేశారు.
అనంతరం చేపల పెంపకం, వాటి యాజమాన్య పద్దతులపై రూపొందించిన కరపత్రాలు,పోస్టర్లను ఆష్కరించారు. కార్యక్ర మంలో సీఐఎఫ్ఏ విజయవాడ సీనియర్ శాస్త్రవేత్త డా.రంగాచార్యులు, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త డా.బి లవకుమార్, జిల్లా మత్స్య సొసైటీ అధికారి సౌజన్య, ఎంపీపీ బండ్ల ప్రశాంతి, ఎంపీడీవో ఈదయ్యలు పాల్గొన్నారు,