చివ్వెంల: అప్పటిదాకా కండ్ల ముందు ఆడుకొని అల్లారి ముద్దుగా చూసుకున్న చిన్న కొడుకు అంతలోనె అనంత లోకాల కు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఏవరితరం కాలేదు. ఈ విషాధకర ఘటన మం డలంలోని జయరాంగుడి తండాలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన గుగులో తు నాగేశ్వరరావు, అనూషల చిన్న కొడుకు రాకేశ్(13) మెదక్ జిల్లాలో సెంట్రల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నా డు. తండ్రి ప్రైవేటు కళాశాలలో లెక్షరర్గా పనిచేస్తుండగా తల్లి గృహిణి.
కాగా బడులు పునః ప్రారంభం కావడంతో సెప్టెంబర్ 1న మెదక్ కు వెళ్లేందుకు సైతం ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదిలా ఉండగా రాకేశ్కు రెండు సంవత్సరాల వయస్సులో గుండెకు రంధ్రం ఏర్పడగా వైద్యం చేయించి మందులు వాడుతున్నా రు. కొడుకు ఏదుగుతున్నాడని ఆరోగ్యంగా కుదుట పడుతున్నాదని అనుకున్నారు. ఇంత లోనే రాకేశ్కు ఒక్కసారిగా గుండె పోటు వచ్చి అక్కడిక్కడే మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బంధువులు సైతం బోరున విలపించారు. దీంతో తండాలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.