సూర్యాపేట : జిల్లాలో అరోగ్య పథకాలు ప్రజలలో ఎక్కువగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వైద్యాధికారులను అదేశించారు. బుధవారం సూర్యాపేటలో మెడికల్ కళాశాలకు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అదనపు సౌకర్యాల మెరుగు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా నిబంధనలు తప్పక పాటించాలన్నారు. అలాగేవర్షాకాలంలో జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున ఆ దిశగా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. క్యాన్సర్ వ్యాధులు గుర్తించడం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలన కోసం వచ్చినట్లు తెలిపారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆరోగ్యవంతమైన సమాజం కోసం మనం పని చేయాలని ఈ సందర్భంగా కోరారు.
వీరి వెంట వైద్య కళాశాల సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కోటాచల, జె.వి.యస్ శాస్త్రీ, జిల్లా అధికారులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ నజియా, డాక్టర్ శ్రీనివాసరాజు, డాక్టర్ వెంకట రమణ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ వినయ్, డాక్టర్ వెంకటపాపి రెడ్డి, డాక్టర్ సాహితి, కిరణ్, మత్స్యగిరి, మధుసుదన్ రెడ్డి, యమున, వీరయ్య, సతీష్ తదితరులు ఉన్నారు.