గరిడేపల్లి: చేపల పెంపకంలో నేల, నీటి యాజమాన్యాలు అత్యంత కీలకమని గడ్డిపల్లి కేవీకే ఇన్చార్జి ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ అన్నారు. మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో గల కేవీకేలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక యువ తకు జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం వారి ఆర్థిక సహకారంతో 15 రోజుల పాటు జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా పదకొండవ రోజైన ఆదివారం చెరువు నీటి పరిశీలన, యాజమాన్యం గురించి అవగాహన కల్పించారు.
నీటి నాణ్యత తగ్గినప్పుడు చేపలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గి చేపలలో మరణ శాతం బాగా పెరుగుతుందన్నారు. తదుపరి పాలేరు మత్స్య పరిశోధన కేంద్రం రీసెర్స్ ఫెలో డి.నందిని నీటి నాణ్యత ప్రమాణాలైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్, కాటిన్యత, ఆమ్ల త్వం, నైట్రేట్లు, కార్బన్ డైయాక్సైడ్ వంటి వాటిని తటస్థంగా ఉంచుకోవాలని సూచించారు. తదుపరి యువత కేవీకేలోని చెరువులను సందర్శించి నీటి నమూనాలను సేకరించి వివిధ నీటి ప్రమాణాలను ప్రాక్టికల్గా పరిశీలించారు. కార్యక్రమంలో రమ్య, శోభారాణి, విజయకుమారి, నాగలక్ష్మి, విజయ, భవాని తదితరులు పాల్గొన్నారు.